న్యూఢిల్లీ: సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తప్పుకుంది. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. వచ్చే నెల 14 నుంచి చైనా వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2018 టోర్నీలో చాంపియన్గా నిలిచిన సింధు.. పోటీ నుంచి తప్పుకోగా.. ఇక వరల్డ్ టూర్ ఫైనల్స్ భారత్ నుంచి హెచ్ఎస్ ప్రణయ్ ఒక్కడే బరిలోకి దిగనున్నాడు.