ఇండోనేషియా ఓపెన్లో సింధు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో సెమీస్ చేరిన సింధు.. శనివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 2 రాచనాక్ ఇంటనాన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ప్రస్తుతం సింధు ప్రపంచ నెంబర్ 3గా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మ్యాచ్లో 21-15, 9-21, 14-21తో ఇంటనాన్ విజయభేరి మోగించింది.
54 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి రౌండ్లో సింధు ఆధిపత్యం చెలాయించింది. అయితే ఆ తర్వాత వరుస సెట్లు కోల్పోయి ఇంటిదారి పట్టింది. గతవారం జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ పోటీలో టాప్-4లో నిలిచిన సింధు.. అక్టోబరులో జరిగిన ఫ్రెంచి ఓపెన్లో కూడా అదే ప్రదర్శన కనబరిచింది.