బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు 21-16, 21-19 తేడాతో యిగిట్ నెస్లిహాన్ (టర్కీ)పై వరుస గేమ్ల్లో గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 18-21, 21-18, 21-11 తేడాతో మన దేశానికి చెందిన సమీర్ వర్మపై నెగ్గాడు. మరో మ్యాచ్లో సౌరభ్ వర్మ గెలువగా.. హెచ్ఎస్ ప్రణయ్ ఓటమిపాలయ్యాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – రాంకీరెడ్డి సాత్విక్ ద్వయం 21-18, 19-21, 21-16 తేడాతో స్కాట్లాండ్ జోడీ క్రిస్టోఫర్ గిమ్లే, మాథ్యూపై గెలిచింది. మహిళల డబుల్స్లో ఎన్.సిక్కిరెడ్డి – అశ్వినీ పొన్నప్ప జోడీ 21-5, 21-19 తేడాతో జర్మనీ ద్వయం కుస్పెర్ట్ – అనాబెలాను చిత్తుచేసింది.