బాసెల్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు స్విస్ ఓపెన్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో గురువారం డిఫెండింగ్ చాంపియన్ సింధు 21-9, 21-16తో జెంజిరా (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. నాలుగో సీడ్గా బరిలోకి దిగిన సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్ల్లో విజృంభించి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. మరోవైపు భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ మిథున్ మంజునాథ్ ప్రిక్వార్టర్స్లో ఓటమి పాలయ్యారు.