న్యూఢిల్లీ : రెండు ఒలింపిక్ పతకాల విజేత పి.వి.సింధు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. కాగా సైనా నెహ్వాల్, లక్ష్యసేన్, సాత్విక్సాయిరాజ్-చిరాగ్శెట్టి, గాయత్రి గోపీచంద్-త్రీసా జాలీ జోడీలు ముందంజ వేయగా, సిక్కిరెడ్డి-శ్రుతి మిశ్రా జోడి ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 7, మాజీ చాంపియన్ సింధు 12-21, 20-22 తేడాతో థాయిలాండ్కు చెందిన సుపానిద కటెథాంగ్ చేతిలో ఓడిపోయింది.
మాజీ చాంపియన్ సైనా 21-17, 12-21, 21-19తో డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్ట్పై గెలుపొందింది. లక్ష్య సేన్ 21-14, 21-1తో స్వదేశానికే చెందిన హెచ్.ఎస్.ప్రణయ్పై విజయం సాధించి మలేసియా ఓపెన్లో ప్రణయ్ చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి 21-13, 21-15తో స్కాట్లండ్ జోడి క్రిస్టాఫర్ గ్రిమ్లే-మాథ్యూ గ్రిమ్లేపై, గాయత్రి-త్రీసా 22-20, 17-21, 21-18తో ఫ్రాన్స్కు చెందిన మార్గొట్ లాంబర్ట్, అన్నె ట్రాన్పై గెలుపొందారు. సిక్కిరెడ్డి-శ్రుతి 17-21, 21-18తో జర్మనీకి చెందిన లిండా ఇఫ్లర్-ఇసబెల్ లోహవ్ చేతిలో ఓడిపోయారు.