RCB vs PBKS | పంజాబ్ బోణీ కొట్టేసింది. తొలి మ్యాచ్లో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలో పంజాబ్.. 208 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో 6 బంతులు మిగిలి ఉండగానే.. పంజాబ్ విజయం సాధించింది.
పంజాబ్ ఆటగాళ్లలో శిఖర్ దావన్ 43, రాజపక్స 43 పరుగులు, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32 పరుగులు, ఒడియన్ స్మిత్ 25, షారుఖ్ ఖాన్ 24, లివింగ్ స్టన్ 19 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు, దీప్, వానిండు, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరులో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 57 బంతుల్లో 88 పరుగులు చేసినప్పటికీ.. ఆ పరుగులు బెంగళూరుకు విజయాన్ని అందించలేకపోయాయి.
Match 3. Punjab Kings Won by 5 Wicket(s) https://t.co/JSYLi206Bg #PBKSvRCB #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 27, 2022