IPL 2024 : పదిహేడో సీజన్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు మరో షాకింగ్ న్యూస్. కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) మరో వారం రోజులు ఆటకు దూరమయ్యాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు దూరమైన గబ్బర్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. ధావన్ కోలుకునేందుకు దాదాపు 10 రోజులపైనే పట్టనుందని ఆ జట్టు కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు.
‘ట్రీట్మెంట్కు ధావన్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే అతడు వారం నుంచి 10 రోజుల పాటు మైదానంలో దిగే చాన్సే లేదు’ అని బంగర్ వెల్లడించాడు. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 71న గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లకు ధావన్ దూరం కానున్నాడు. అతడి గైర్హాజరీలోఆల్రౌండర్ సామ్ కరన్ జట్టును నడిపించనున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో రెండు మ్యాచ్ల తర్వాత గెలుపు రుచి చూసిన పంజాబ్.. ఆ తర్వత మళ్లీ ఓటమి బాట పట్టింది. బౌలర్లు రాణిస్తున్నా.. బ్యాటర్ల నిలకడలేమితో వరుసగా రెండు మ్యాచులోనూ పంజాబ్ చతికిలబడింది. రాజస్థాన్పై ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్ను తీసుకెళ్లినా.. ఆర్ష్దీప్ సింగ్ రెండు సిక్సర్లు ఇవ్వడంతో సామ్ కరన్ బృందం నిరాశతో మైదానం వీడింది.