చెన్నై : భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో రాణించడంతో సీనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్లో పంజాబ్ జట్టు 5-1తో కర్ణాటకపై గెలుపొంది ఫైనల్స్కు చేరుకుంది. పంజాబ్కు హర్మన్ప్రీత్ సింగ్(39ని., 44ని.), షంషేర్ సింగ్(4ని.), సుఖజీత్ సింగ్(13ని.), అకాశ్దీప్ సింగ్(45ని.) గోల్స్ సాధించగా, అభిరాన్ సుదేవ్(18ని.) కర్ణాకటకు ఏకైక గోల్ను సాధించిపెట్టాడు. పంజాబ్ ఫైనల్లో హర్యానాను ఢీకొంటుంది. రెండో సెమీఫైనల్లో హర్యానా షూటౌట్ద్వారా నిర్వాహక తమిళనాడు జట్టుపై గెలుపొందింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలువడంతో జరిగిన షూటౌట్లో హర్యానా 4-2 తేడాతో విజయం సాధించింది.