పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్లో పుణెరీ పల్టాన్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో పుణెరీ 8-7తో గోవా చాలెంజర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రపంచ 159వ ర్యాంకర్ అర్చనా కామత్ 2-1తో సుతాసిని సావెటాబుట్పై అద్భుత విజయం సాధించింది. మిగతా మ్యాచ్ల్లో మిక్స్డ్ డబుల్స్లో మానుష్, హనా ద్వయం 3-0తో హర్మీత్, సుతాసిని జోడీపై, అస్సర్ 2-1తో రోబుల్స్పై నెగ్గి పుణెకు విజయాన్ని కట్టబెట్టారు.