పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) తొలి సీజన్లో పుణెరి పల్టన్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పుణెరి పల్టన్ 10-5తో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ క్రమంలో భారత యువ ఆటగాడు మనుశ్ షా.. సంచలన ప్రదర్శనతో ప్రపంచ 17వ ర్యాంకర్ ఖాద్రికి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 133వ స్థానంలో ఉన్న మనుశ్ షా.. అద్వితీయమైన ఆటతీరుతో ఖాద్రిని బోల్తా కొట్టించాడు. లీగ్ దశలో 38 పాయింట్లు సొంతం చేసుకున్న పుణెరి సెమీస్లో అడుగుపెట్టగా.. 33 పాయింట్లకే పరిమితమైన యూ ముంబా లీగ్ దశలోనే నిష్క్రమించింది.