Virat Kohli – Puma : ప్రపంచ క్రికెట్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరు ఒక బ్రాండ్. కోట్లాది మంది అభిమానగణం ఉన్న విరాట్ తమ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనే ప్రతి కంపెనీ కోరుకుంటుంది. ఈ రన్ మెషిన్ గత కొన్నాళ్లుగా ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీ పుమా(Puma)కు ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. అయితే.. గత రెండు మూడు రోజులుగా కోహ్లీ.. పుమాను వీడనున్నాడనే వార్తలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
ఎనిమిందేండ్లుగా పుబా అంబాసిడర్గా ఉన్న కోహ్లీ.. త్వరలోనే భారత్కు చెందిన అజిలిటాస్(Ajilitas) స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నడనే వార్తలు వినిపించాయి. కానీ, పుమా మేనేజింగ్ డైరెక్టర్ కార్తిక్ బాలగోపాలన్(Karthik Balagopalan) మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. ‘కోహ్లీతో పుమా అనుబంధం సుదీర్ఘమైనది. ఆ బంధం కొనసాగుతూనే ఉంటుంది’ అని గురువారం బాలగోపాలన్ ఓ ప్రకటనలో తెలిపాడు.
విరాట్ కోహ్లీ
జర్మనీకి చెందిన పుమా కంపెనీ 2017 ఫిబ్రవరిలో కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఆ ఒప్పందంలో భాగంగా అతడికి రూ.110 కోట్లు చెల్లించేందుకు పుమా అంగీకరించింది. కోహ్లీతో పాటు భార్య అనుష్కా శర్మ, బాక్సర్ మేరీ కోమ్, హర్మన్ప్రీత్ కౌర్, మహ్మద్ షమీలు భారత్లో పుమా ప్రచారకర్తలుగా కొనసాగుతున్నారు.
వన్డే వరల్డ్ కప్లో సెంచరీలతో రికార్డు నెలకొల్పిన విరాట్.. కొత్తే ఏడాది స్వదేశంలో ఎప్పుడు మైదానంలోకి దిగుతాడో తెలియడం లేదు. అవును.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఈ స్టార్ బ్యాటర్ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. వ్యక్తిగత కారణాలతో మొదట తొలి రెండు టెస్టులు ఆడని విరాట్.. ఇప్పుడు ఏకంగా సిరీస్ మొత్తం దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి రెండు టెస్టులు ముగియడంతో.. మిగతా మూడు టెస్టులకు బీసీసీఐ రెండు రోజుల్లో స్క్వాడ్ను ప్రకటించనుంది. దాంతో, ఆ లిస్ట్లో కోహ్లీ పేరు ఉండాలని ఫ్యాన్స్ కోరకుంటున్నారు. ఐదు టెస్టుల సిరీస్లో భారత్, ఇంగ్లండ్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. కీలకమైన మూడో టెస్టు రాజ్కోట్లో ఫిబ్రవరి 15వ తేదీన జరుగనుంది.