Pullela Gopichand : భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గోపిచంద్(Pullela Gopichand) ఒక దిగ్గజం. తన అద్వితీయ ఆటతో ఈతరం ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్ కోచ్(India national badminton team head coach)గా ఉన్న అతను తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బెంగళురలోని మనీకంట్రోల్ స్టార్టప్ కాంక్లేవ్ 2023(Moneycontrol Startup Conclave 2023) కార్యక్రమంలో మాట్లాడిన గోపిచంద్ మొదట్లో క్రికెటర్ అవ్వాలనుకున్నాని చెప్పాడు. కానీ, జట్టులో చోటు దక్కకపోవడంతో బ్యాడ్మింటన్ వైపు వచ్చాడట.
‘చిన్నప్పుడు ఫుట్బాల్ నా ఫేవరెట్ గేమ్. కానీ, నా మోకాళ్లు సహకరించకపోవడంతో ఫుట్బాల్ ఆడలేకపోయాను. అయితే.. క్రికెటర్ అవ్వాలనుకున్నా. కానీ, జట్టులోకి నన్ను తీసుకోలేదు. దాంతో, బ్యాడ్మింటన్ ఆటపై దృష్టి సారించాను’ అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన గోపిచంద్ తెలిపాడు.
అంతేకాదు ఇంజనీరింగ్ పరీక్షలో ఫెయిల్ కావడం తన అదృష్టమని అన్నాడు. ‘నేను ఇంజనీరింగ్ పరీక్ష రాశాను. అందులో పాస్ మార్కులు 45. కానీ, నాకు 38 మార్కులే వచ్చాయి. ఒకవేళ ఏడు ప్రశ్నలకు సరైన సమాధానం పెట్టి ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఇంజనీర్ అయ్యేవాడిని. అయితే.. అది ఆ రంగంపై పెద్ద ప్రభావం చూపేది. ఒకరకంగా అది నా మంచికే జరిగింది. నేను బ్యాడ్మింటన్ను ఒక ఆప్షన్ అనుకోలేదు. ఇందులో కచ్చితంగా సక్సెస్ కావాలనే లక్ష్యంతో ఆడాను’ అని గోపిచంద్ చెప్పుకొచ్చాడు.
#MCStartupConclave | Here’s what #AIKaur asked @PGopichand73 about his favourite sport
Live updates👇https://t.co/CDWwmIEdp7#ToughGetGoing @chandrarsrikant @peakxvpartners @IDFCFIRSTBank @awscloud @cisco_in @MiraeAsset_IN @mstock_in @SpanCom_in pic.twitter.com/yMaZ0cM4Sk
— Moneycontrol (@moneycontrolcom) July 7, 2023
గోపిచంద్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వాటిలో కొన్ని.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్(All England Open Badminton Championships) నెగ్గిన రెండో భారతీయుడు గోపిచంద్. 1996 నుంచి వరుసగా ఐదేళ్లు జాతీయ చాంపియన్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు 1998 కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం గెలిచాడు. ఆ ఏడాది అతడకి అర్జున అవార్డు వచ్చింది.
బ్యాడ్మింటన్ అకాడమీలో గోపిచంద్
ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత గోపిచంద్ తన పేరుతో సొంతంగా అకాడమీ పెట్టాడు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి స్టార్ షట్లర్లను భారత్కు అందించాడు. అతడి సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది.