శేరిలింగంపల్లి : హైదరాబాద్..బ్మాడ్మింటన్ హబ్గా కొనసాగేందుకు మరో అడుగు పడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ సహకారంతో గచ్చిబౌలిలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ మొదలైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇది రూపుదిద్దుకుంది. ఆరు ఎయిర్ కండీషన్ కోర్టులతో కూడిన హై ఫెర్ఫార్మెన్స్ సెంటర్గా కొనసాగనుంది. దీనికి తోడు ప్లేయర్ల ఫిట్నెస్ కోసం పౌష్టికాహార నిపుణుల, ఫిజియోథెరపిస్టులు, కండిషనింగ్ నిపుణులతో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ లాంటి సౌకర్యాలు నెలకొల్పారు. ఆర్థికంగా వెనుకబడిన ప్లేయర్లు, కోచ్ల కోసం ఫెల్షిప్ ప్రొగ్రామ్లు అమలు చేస్తున్నారు. బ్యాడ్మింటన్ కేవలం హైదరాబాద్ వరకే పరిమితం గాకుండా దేశంలోని మిగతా నగరాలకు విస్తరించేందుకు మాజీ ప్లేయర్లకు సర్టిఫికేషన్ ప్రొగ్రామ్ నిర్వహిస్తున్నారు. అకాడమీ ప్రారంభ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్తో పాటు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.