హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అత్యున్నత ప్రమాణాలతో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తులు అందించేందుకు యోనెక్స్ సిద్ధమైంది. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా శుక్రవారం యోనెక్స్ స్టోర్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్తో పాటు సన్రైజ్ స్పోర్ట్స్ ఎండీ విక్రమాదిత్యధర్ పాల్గొన్నారు. దేశ బ్యాడ్మింటన్లో యోనెక్స్ది చెరగని ముద్ర అని గోపీచంద్ అన్నారు. ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్లలో భారత ప్లేయర్లు సత్తాచాటిన వైనం మరువలేనిదని గుర్తుకు చేశారు.