Duleep Trophy : భారత జట్టు నయా వాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara)కు ఈరోజు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) విఫలమైన అతడిని వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో, పూజరా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనపై వేటు వేయడంతో అసంతృప్తికి గురైన అతను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు.
ఈ టోర్నీలో అతను వెస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. పూజరాతో పాటు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కూడా అదే జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరు జట్లు పాల్గొంటున్న దులీప్ ట్రోఫీ బెంగళూరు వేదికగా జూన్ 28న మొదలవ్వనుంది. విండీస్తో టెస్టులకు ఎంపిక్వని సూర్య.. ట్రోఫీ తర్వాత వన్డే జట్టుతో కలవనున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పూజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. అంతకు ముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ(County)ల్లో అద్భుతంగా రాణించిన అతను ఫైనల్లో చేతులెత్తేశాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో పూజారా పరుగులు సాధించడం లేదు. దాంతో, శివసుందర్ దాస్(Shiv Sunder Das) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిపై వేటు వేసింది. వెస్టిండీస్ టూర్కు టెస్టు, వన్డేలకు 16 మందితో కూడిన బృందాన్ని ఈరోజు కమిటీ ప్రకటించింది. భారత జట్టు విండీస్ గడ్డపై 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ 20 ఆడనుంది.