ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై పట్నా పైరేట్స్ జయభేరి మోగించింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో 29-38 తేడాతో పట్నా విజయం సాధించింది. పట్నా జట్టులో సచిన్ 11 రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. ఆ తర్వాత గుమన్ సింగ్ కూడా ఏడు రైడ్ పాయింట్లు సాధించాడు. షడ్లోయి చియానే ఐదు టాకిల్ పాయింట్లతో అదరగొట్టాడు.
ఇక బెంగాల్ విషయానికొస్తే.. మనోజ్ గౌడ మొత్తం 9 పాయింట్లు సాధించాడు. ఇస్మాయిల్ నబీబక్ష్ 8 పాయింట్లతో సత్తాచాటాడు. కానీ వీళ్లిద్దరూ బెంగాల్ను గెలిపించలేకపోయారు. పట్నా పాయింట్లలో 22 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లు, నాలుగు ఆలౌట్ పాయింట్లు, ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉన్నాయి.
వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న బెంగాల్ జట్టు పాయింట్ల పట్టికలో పదో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో సూపర్ విక్టరీ నమోదు చేసిన పట్నా జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో దబంగ్ ఢిల్లీ జట్టు కొనసాగుతోంది.