Pro Kabaddi League | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో పుణెరీ పల్టన్, హర్యానా స్టీలర్స్ మధ్య తుదిపోరు జరగనుంది. ఇరు జట్లలో ఏది గెలిచినా వారికి ఇదే తొలి టైటిల్ కానుంది. ప్రొ కబడ్డీ లీగ్లో పుణెరీ పల్టన్ రెండోసారి ఫైనల్లో పోటీపడుతుండగా.. హర్యానా స్టీలర్స్ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
నిరుడు ఫైనల్లో ఓడిన పుణెరీ ఈ సారి ఫుల్ జోష్ కనబర్చి.. గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి నిలకడైన ప్రదర్శన చేస్తు న్న హర్యానా స్టీలర్స్ అదే ఊపులో టైటిల్ పట్టాలని చూస్తున్నది.