ఒర్లిన్స్: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ ఒర్లిన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం ప్రియాన్షు 21-12, 21-9తో ఐర్లాండ్కు చెందిన నహట్ ఎన్గ్యుయెన్పై విజయం సాధించాడు. 21 ఏళ్ల ప్రియాన్షు ప్రపంచ 35వ ర్యాంకర్ను వరుస గేమ్లలో మట్టికరపించాడు. సూపర్-300 టోర్నీలో ప్రియాన్షు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరుగనున్న ఫైనల్లో మాగ్నస్ జొహన్సన్తో ప్రియాన్షు తలపడనున్నాడు.