మాడ్రిడ్: భారత యువ షట్లర్లు ధ్రువ్ కపిల-అర్జున్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్-అర్జున్ జంట 16-21, 21-17, 21-12తో క్రిస్టోఫర్ గ్రిమ్లే-మాథ్యూ గ్రిమ్లే జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో వరుస విజయాలు సాధించిన ప్రియాన్షు రజావత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. తొలి రౌండ్లో 21-18, 18-21, 21-15తో ఫ్రాన్స్ షట్లర్ అలెక్స్ లానియర్పై నెగ్గిన ప్రియాన్షు.. రెండో రౌండ్లో 21-16, 21-12తో ఫ్రాన్సిస్కోపై విజయం సాధించాడు. తెలంగాణ షట్లర్ సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ తొలి రౌండ్లో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. అశ్విని పొన్నప్ప-సుమీత్ రెడ్డి జంట కూడా పరాజయం పాలైంది.