కొలంబో: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ల కోసం సిద్ధమవుతోంది ఇండియన్ టీమ్. అక్కడ అవసరమైన క్వారంటైన్ ముగిసిన తర్వాత నెట్స్టో ప్రాక్టీస్ చేయడంతోపాటు టీమే రెండుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతోంది. శుక్రవారం జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, పృథ్వి షా, నితీష్ రాణాలాంటి ప్లేయర్స్ భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఇక బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, చాహల్, సైనీ చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక వెళ్లిన ఇండియన్ టీమ్లో ఐదుగురు ప్లేయర్స్ తొలిసారి జాతీయ జట్టుకు ఆడాలని తహతహలాడుతున్నారు. వీళ్లలో దేవ్దత్ పడిక్కల్, సకారియా, నితీష్ రాణా, క్రిష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. వీళ్లలో తుది జట్టులో ఎవరికైనా చాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి.