హైదరాబాద్ ఆట ప్రతినిధి: హెచ్సీఏ ఏ-2 డివిజన్ వన్డే లీగ్లో పృథ్వీ సాయి యాదవ్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ఆక్స్ఫర్డ్ బ్లూస్తో గురువారం జరిగిన పోరులో హెసీఏ అకాడమీ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ బంతితో రాణించాడు.
మొదట ఆక్స్ఫర్డ్ జట్టు 43.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ప్రణీత్ కుమార్ (83) టాప్ స్కోరర్ కాగా.. పృథ్వీ 5, ప్రధ్యుమ్న్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో హెచ్సీఏ అకాడమీ 43.5 ఓవర్లలో 3 వికెట్లకు 248 రన్స్ చేసింది. లక్ష్యన్ శివ (107) సెంచరీతో కదంతొక్కాడు.