న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. పారా విశ్వక్రీడల్లో ఈ సారి భారత్ అత్యధిక 19 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. తాజా క్రీడల్లో 17 మంది పతకాలు సాధించారు. అయితే షూటర్లు అవని, సింగ్రాజ్ రెండేసి పతకాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.