హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ స్టేడియంలో వచ్చే నెల 18వ తేదీన హెచ్సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) జరుగుతుందని అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. 2018 నుంచి దాదాపు ఐదేండ్లుగా పెండింగ్లో ఉన్న అకౌంట్లను పరిశీలించి ఆమోదించడంతో పాటు అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకం, జస్టిస్ నాగేశ్వర్రావు కమిటీ సిఫారసులను అమలు చేయడంపై చర్చిస్తామని తెలిపారు.
హెచ్సీఏ స్టాండింగ్ కమిటీలతో పాటు క్రికెట్ కమిటీలను కూడా భర్తీ చేయనున్నట్లు వివరించారు. బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ భేటీల్లో హెచ్సీఏ ప్రతినిధిగా పాల్గొనే వ్యక్తిని కూడా ఏజీఎంలో నిర్ణయిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ క్రికెట్ చరిత్రపై పీఆర్ మాన్సింగ్ రాసిన ‘క్రికెట్ బిర్యానీ’ పుస్తకాన్ని ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లేకు జగన్ అందజేశారు.