హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో హ్యాండ్బాల్కు సంబంధించి అన్ని హక్కులు హ్యాండ్బాల్ అసోసియేషన్ ఇండియా(హెచ్ఏఐ)కే దక్కుతాయని అధ్యక్షుడు జగన్మోహన్రావు స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా హ్యాండ్బాల్ సంఘంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్లో హ్యాండ్బాల్ కార్యకలపాలన్నీ హెచ్ఏఐ పరిధిలోకే వస్తాయని అంతర్జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య(ఐహెచ్ఎఫ్) భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) దృష్టికి తీసుకొచ్చింది.
హెచ్ఏఐకు మాత్రమే తాము గుర్తింపు ఇస్తున్నామని వేరే ఏ ఇతర సంఘానికి ఇందులో చోటు లేదంటూ ఐవోఏ సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబేకు ఐహెచ్ఎఫ్ జనరల్ డైరెక్టర్ అమల్ ఖలీఫా గురువారం ఒక లేఖ ద్వారా తెలిపారు. హెచ్ఏఐ కాకుండా వేరే హ్యాండ్బాల్ సంఘానికి భారత్లో గుర్తింపు లేదంటూ స్పష్టంగా పేర్కొంది.
ఈ విషయంలో ఐవోఏ వెంటనే కలుగజేసుకోవాలని చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న సంఘంపై చర్యలు తీసుకోవాలంటూ సూచించింది. ఇదిలా ఉంటే తనకు మద్దతుగా నిలిచిన ఆనందీశ్వర్పాండే, తేజ్రాజ్, అన్ని రాష్ట్ర సంఘాలకు ఈ సందర్భంగా జగన్మోహన్రావు కృతజ్ఞతలు తెలిపారు.