న్యూఢిల్లీ: స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అభిషేక్ వర్మ తడబడ్డ చోట ప్రథమేశ్ దుమ్మురేపాడు. మెక్సికో వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్లో కాంపౌండ్ విభాగంలో బరిలోకి దిగిన ప్రథమేశ్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆసాంతం రాణించిన ప్రథమేశ్ ఆదివారం తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు.
డెన్మార్క్ ఆర్చర్ మాథియాస్ ఫుల్లెరటన్తో జరిగిన ఫైనల్లో 148-148తో స్కోర్లు సమం కాగా.. విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ నిర్వహించారు. అందులోనూ ఇరువురు ఆర్చర్లు సమంగా నిలిచినా.. లక్ష్యానికి చాలా దగ్గరగా బాణాలు సంధించిన మాథియాస్ను విజేతగా ప్రకటించారు.