Pragyan Ojha : భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా(Pragyan Ojha) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు ఈ హైదరాబాదీ ప్రకటించనున్నాడు. గోవాలో జరుగబోయే వార్షిక సమావేశంలో భారత క్రికెట్ బోర్డు(BCCI) పలు అంశాలపై నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వీటిలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (Governing Council)లో మార్పులతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League) కోసం కొత్త గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం వంటివి ముఖ్యమైనవి.
దాంతో, గవర్నింగ్ కౌన్సిల్ నుంచి స్వయంగా తానే తప్పుకుంటున్నట్టు ఓజా బీసీసీఐ పెద్దలకు చెప్పనన్నాడని సమాచారం. ఈ మాజీ స్పిన్నర్ మూడేళ్లు ఈ పదవిలో కొనసాగాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక ఓజా ఐపీఎల్ పాలక మండలిలో భాగమయ్యాడు. నిరుడు భారత క్రికెట్ సంఘం(ICA) అతడిని ఐపీఎల్ పాలక మండలి సభ్యుడిగా ఎంచుకుంది. అయితే.. మరో రెండేళ్ల పాటు ఓజాకు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కానీ, అతడు అందుకు విముఖత చూపించినట్టు తెలుస్తోంది.
2009లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన దక్కన్ చార్జర్స్
హైదరాబాద్కు చెందిన ఓజా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లోనూ ఈ స్పిన్నర్ మెరిశాడు. అంతేకాదు మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. తొలిసారి అతను దక్కన్ చార్జర్స్(Deccan Chargers) తరఫున ఐపీఎల్ కప్పు అందుకున్నాడు. అనంతరం ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్లేయర్గా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడాడు.