శాన్ఫ్రాన్సిస్కో: మెల్ట్వాటర్ చాంపియన్స్ టూర్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి వరుసగా రెండో రౌండ్లోనూ ఓటమి చవిచూశారు. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో 0.5-2.5 స్కోరుతో అర్జున్ ఓటమి ఎదుర్కొన్నాడు.
మరోవైపు డచ్ గ్రాండ్మాస్టర్ అనీష్ గిరి చేతిలో 2.5-3.5 తేడాతో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన వెస్లీ సోతో అర్జున్ తలపడనుండగా, వియత్నాంకు చెందిన లీమ్ లిని ప్రజ్ఞానంద ఎదుర్కోనున్నాడు.