న్యూఢిల్లీ : నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగ ఆరోపణలు ఎదుర్కొన్న ఆసియా క్రీడల పతక విజేత ఎంఆర్ పూవమ్మ తిరిగి రంగ ప్రవేశం చేసింది. 33 ఏళ్ల పూవమ్మ బుధవారం జాతీయ క్రీడల్లో కర్ణాటక తరఫున పాల్గొన్నది. 2014, 2018 ఆసియా క్రీడల్లో పూవమ్మ 400మీ., 4X400 రిలేలో పలు పతకాలు గెలుచుకున్నది.
నిషేధంపై పూవమ్మ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో నిషేధం ఎప్పటినుంచి అమలు అవుతుందన్న విషయమై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు శాంపి ల్స్ సేకరించిన ఫిబ్రవరి 18, 2021నుంచి నిషేధం అమలులోకి వచ్చినట్టు, ప్రస్తుతం ఆమె నిషేధం తొలగినట్టు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివరించింది. దీనితో పూవమ్మ జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది.