పల్లెకిలే: నేపాల్తో జరుగుతున్న ఆసియాకప్(Asia Cup) వన్డే మ్యాచ్లో.. భారత ఫీల్డర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు.. ఆ స్థాయిలో ఫీల్డింగ్ చేయడం లేదు. నేపాల్ ఓపెనింగ్ బ్యాటర్లు బుర్తల్, ఆసిఫ్లు ఇచ్చిన క్యాచ్లను మనవాళ్లు వదిలేశారు. తొలుత శ్రేయాస్ అయ్యారు, విరాట్ కోహ్లీ, కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్లు పట్టలేకపోయారు. దీంతో పసికూన నేపాల్ నెమ్మదినెమ్మదిగా స్కోరు బోర్డును పరుగెత్తిస్తోంది. బుర్తల్ ఓ దశలో సిరాజ్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టాడు. బుర్తల్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్స్లో శ్రేయాస్ అయ్యర్ వదిలేశాడు. ఆసిఫ్ ఇచ్చిన క్యాచ్ను మిడాఫ్లో కోహ్లీ అందుకోలేకపోయాడు. బుర్తల్ రెండోసారి ఇచ్చిన క్యాచ్ను కీపర్ కిషన్ డ్రాప్ చేశాడు. 10 ఓవర్లలో నేపాల్ జట్టు వికెట్ నష్టానికి 65 రన్స్ చేసింది. బుర్తల్ 38 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆసిఫ్ 20 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు.
3 Dropped Catches 😱 #IndvsNep pic.twitter.com/LQOnqv3yEN
— Susanta Sahoo (@ugosus) September 4, 2023