జూబ్లీహిల్స్: జాతీయ సబ్ జూనియర్ గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో హైదరాబాదీ పూజ నిత్లేకర్ పసిడి పతకాలతో అదరగొట్టింది. ఉత్తరాఖండ్లో జరిగిన పోటీల్లో వేర్వేరు విభాగాల్లో(37కి, 40కి) స్వర్ణాలతో మెరిసింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను చిత్తుచేసింది.
ప్రస్తుతం యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పూజ తన తండ్రి చంద్రకాంత్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నది. ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పూజ సత్తాచాటి ఆకట్టుకుంది. భవిష్యత్లోనూ రాష్ట్రం తరఫున మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.