BCCI | ముంబై: టెస్టు క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను బోర్డు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఒక సీజన్లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడితే ఒక్కో పోరుకు రూ.45 లక్షల ఇన్సెంటివ్ ఇవ్వనుంది.
ప్రస్తుతమున్న మ్యాచ్ ఫీజు రూ.15లక్షలకు ఇది అదనం. 50 శాతం కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడితే రూ.30లక్షల ఇన్సెంటివ్ ఇస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. 2022-23 సీజన్ నుంచే ఇది అమలు చేస్తామని షా పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఒక సీజన్లో పది టెస్టులు ఆడే క్రికెటర్కు మ్యాచ్ ఫీజు 15 లక్షలతో పాటు 4.5 కోట్ల ఇన్సెంటివ్ లభిస్తుంది.