సెంచూరియన్: టాపార్డర్ రాణించడంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమ్ఇండియాకు వరుణుడు బ్రేకులు వేశాడు. సెంచూరియన్లో సోమవారం భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రైద్దెంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. నయా వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 122 బ్యాటింగ్; 17 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకంతో ఆకట్టుకోగా.. సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే (40 బ్యాటింగ్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. సోమవారం మరింత భారీ స్కోరు చేసి ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచాలనుకున్న టీమ్ఇండియా ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురువడంతో మైదానం ఆటకు అనుకూలించదని భావించిన అంపైర్లు పలు సమీక్షల అనంతరం రెండో రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు.. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సిరీస్ పట్టలేకపోగా.. ఈసారి బలమైన బలగంతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన కోహ్లీసేన.. సిరీస్ పడుతుందనుకుంటే తొలి టెస్టులోనే మనవాళ్లకు ప్రకృతి సవాలు విసిరింది. మంగళవారం కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి.
ఆత్మవిశ్వాసమే నా బలం: శార్దూల్
ఇక మూడు రోజుల ఆట మాత్రమే మిగిలిన ఈ టెస్టులో టీమ్ఇండియా వేగంగా ఆడి మంచి స్కోరు సాధిస్తేనే ఫలితం వచ్చే అవకాశాలు ఉండగా.. రెండో రోజు ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితమయ్యారు. రెండు సార్లు కాస్త వరుణుడు తెరిపినిచ్చినా.. సరిపడ ఎండకాయకపోవడంతో మైదానం ఆరడానికి సమయం పట్టింది. అంతలోనే మళ్లీ వర్షం ముంచెత్తడంతో గ్రౌండ్ అంతా తడిసి ముైద్దెంది. పేస్ ఆల్రౌండర్గా జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న శార్దూల్ ఠాకూర్.. బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అశ్విన్తో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శార్దూల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్లపై రాణించినట్లే.. ఇక్కడ (దక్షిణాఫ్రికాలో) కూడా సత్తాచాటాలనుకుంటున్నా. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన చేస్తే అంతకుమించిన ఆనందం ఏముంటుంది. మైదానంలో అడుగు పెట్టిన ప్రతిసారీ వంద శాతం కష్టపడేందుకు సిద్ధంగా ఉంటా. బౌలింగ్లో అయినా.. బ్యాటింగ్లో అయినా జట్టుకు నా వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తా. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తా’ అని అన్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్కు దూరమైన హార్దిక్ పాండ్యా టెస్టు జట్టులో చోటు కోల్పోగా.. ఇటీవలి కాలంలో శార్దూల్ బంతితో, బ్యాట్తో చక్కటి ప్రదర్శన కనబరిచి భళా అనిపించుకుంటున్నాడు.