Piyush Chawla on Kohli | ఇంగ్లండ్తో రెండవ టీ-20 మ్యాచ్లో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిస్వార్థంగా ఆడాడని వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి తొలి టీ-20 మ్యాచ్లో జట్టు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. టీ-20 తొలి మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ స్థానే వచ్చిన దీపక్ హుడా అదరగొట్టాడు. రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన కోహ్లీ తిరిగి తన స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. అయితే, ఇంగ్లండ్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ చేతిలో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు.
దీనిపై పీయూష్ చావ్లా ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ టీం కోసం ఆలోచించడం వల్లే కోహ్లీ ధాటిగా ఆడి వికెట్ కోల్పోయాడన్నారు. బ్యాటింగ్ పిచ్పై షాట్ కొట్టేందుకు వెళ్లి ఔటయ్యాడని చెప్పాడు. జట్టు కోసం ఆయన నిస్వార్థంగా ఆడిన సంగతి గమనించాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ మళ్లీ గాడిలో పడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీం ఇండియా అవసరాలకు తగినట్లు తనను తాను మార్చుకుంటాడన్నాడు.