న్యూఢిల్లీ: ఇక కష్టమే అనుకుంటున్న స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో విజృంభిస్తున్నది. గత మ్యాచ్లో గుజరాత్ను మట్టికరిపించిన వార్నర్ సేన.. శనివారం రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను చిత్తుచేసింది.తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (55; 5 ఫోర్లు), మహిపాల్ లోమ్రర్ (54 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్ డుప్లెసిస్ (45; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మార్ష్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 187 రన్స్ చేసింది. సాల్ట్ (45 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు. హజిల్వుడ్, కరణ్ శర్మ, హర్షల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. సాల్ట్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు: బెంగళూరు: 181/4 (కోహ్లీ 55, లోమ్రర్ 54 నాటౌట్; మార్ష్ 2/21), ఢిల్లీ: 16.4 ఓవర్లలో 187/3 (సాల్ట్ 87, రాసో 35 నాటౌట్; హజిల్వుడ్ 1/29).