మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది ఆఖర్లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి పోరుకు పెర్త్ ఆతిథ్యమిచ్చే అవకాశముంది. ఆస్ట్రేలియా వార్తాసంస్థ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు పెర్త్లో జరిగే చాన్స్ ఉన్నట్లు పేర్కొంది. గతానికి భిన్నంగా ఈసారి నాలుగు టెస్టులకు బదులు ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగునంది.
అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలుగా మిగతా మ్యాచ్లు జరుగుతాయని తమ కథనంలో రాసుకొచ్చింది. అయితే భారత్, ఆసీస్ టెస్టు సిరీస్పై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. నవంబర్లో మొదలయ్యే అవకాశమున్న సిరీస్ పూర్తి షెడ్యూల్ ఈ నెల ఆఖర్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాల్లో భారత్ విజేతగా నిలిచింది.