PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండో టెస్టు సందర్భంగా అభిమానులకు పాక్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్ చూసేందుకు టికెట్ లేకుండానే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనుంది. మొదటి టెస్టులో ఆడియెన్స్ లేకపోవడంతో స్డేడియం వెలవెలబోయింది. దాంతో, రెండో టెస్టుకు జనాలను రప్పించాలనే ఉద్దేశంతో పీసీబీ ఆ ఆలోచన చేసింది. అలాగని ఆడియెన్స్పై ఎలాంటి పరిమితులు విధించరు. స్టేడియంలోని ఫస్ట్ క్లాస్ సీట్లలోనూ కూర్చొని ప్రేక్షకులు మ్యాచ్ను ఎంజాయ్ చేయొచ్చు.
‘మ్యాచ్ చూడ్డానికి వచ్చేవాళ్లు పాకిస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు లేదా బీఫామ్ తప్పనిసరిగా తీసుకురావాలి. స్టేడియంలోకి ఎలాంటి ఆహారపదార్థాలు, డ్రింక్స్ తీసుకొని రావద్దు. పాకిస్థాన్, న్యూజిలాండ్ దేశాల జాతీయ జెండాలు మాత్రమే తీసుకొని రావాలి’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం ఉన్నందున స్టేడియం మొత్తం కిక్కిరిసి పోవాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం కరాచీలోని విద్యాసంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను పీసీబీ అధికారులు కోరారు. రెండో టెస్టు 2023 జనవరి 2వ తేదీన కరాచీలో మొదలవ్వనుంది.
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో పాక్ దారుణంగా ఓడిపోయింది. ఈ ఏడాది సొంత గడ్డపై ఆడిన 4 టెస్టుల్లోనూ పాక్ ఓటమి పాలైంది. పాక్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్ను తొందరగా నిలిపివేశారు. దాంతో ఇరు జట్లు చివరిదైన రెండో టెస్టులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం శతకంతో కదం తొక్కాడు. ఈ మధ్యే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
🚨 Free entry for spectators for the second #PAKvNZ Test
More details ➡️ https://t.co/nw2T5mCfnk#TayyariKiwiHai pic.twitter.com/Cfcb5RgezS
— Pakistan Cricket (@TheRealPCB) December 31, 2022