పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (30) అవుటైనప్పటికీ.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వల్ (22 నాటౌట్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. అతనికి జత కలిసి కెప్టెన్ సంజూ శాంసన్ (6 బంతుల్లో 15 నాటౌట్) కూడా రాణిస్తున్నాడు.
దీంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.