పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (6) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని బ్యాక్ఫుట్లో ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ జితేష్ శర్మ అందుకోవడంతో రాహుల్ పెవిలియన్ చేరాడు.
రాహుల్ అవుటవడంతో దీపక్ హుడా క్రీజులోకి వచ్చాడు. ఫామ్లో ఉన్న రాహుల్ వికెట్ కోల్పోవడంతో లక్నో జట్టు భారీ స్కోరు చేసే అవకాశాలు దెబ్బతిన్నట్లే అని అభిమానులు భావిస్తున్నారు.