ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ తీవ్రంగా తడబడుతోంది. ఓపెనర్లు బెయిర్స్టో (28), ధవన్ (19) భారీ స్కోర్లు చెయ్యలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ మయాక్ అగర్వాల్ (0) డకౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన బంతిని ఆడటానికి విఫలప్రయత్నం చేసిన అతను.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్లో ఫామ్లో ఉన్న లివింగ్స్టన్ (3) కూడా అవుటయ్యాడు. ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. బంతిని మిస్ అయ్యాడు. ఆ సమయంలో పంత్ వేగంగా స్టంపింగ్ చేసేయడంతో లివింగ్స్టన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో పంజాబ్ జట్టు 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 61 పరుగులు మాత్రమే చేసింది.