పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన లలిత్ యాదవ్ (24) పెవిలియన్ చేరాడు. అర్షదీప్ సింగ్ వేసిన 11వ ఓవర్ చివరి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బాల్లో పేస్ లేకపోవడంతో రాజపక్సకు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఢిల్లీ సారధి రిషభ్ పంత్ (7) కూడా పెవిలియన్ చేరాడు.
లివింగ్స్టన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. క్రీజును వదిలి చాలా ముందుకు వచ్చేశాడు. కానీ బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో బంతిని అందుకున్న కీపర్ జితేష్ శర్మ స్టంపింగ్ పూర్తిచేయడంతో పంత్ కూడా మైదానం వీడాడు. ఈ వికెట్తో 12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే లివింగ్స్టన్ వేసిన 14వ ఓవర్లో రావ్మెన్ పావెల్ (2) కూడా అవుటయ్యాడు.