పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు చివర్లో తడబడ్డారు. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (32), మిచెల్ మార్ష్ (63) అద్భుతంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన లలిత్ యాదవ్ (24) భారీ షాట్లు ఆడకున్నా ఇన్నింగ్స్ నిర్మించడానికి సహకరించాడు. పిచ్ బౌలర్లకు సహకరించడంతో ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (7), పావెల్ (2), శార్దూల్ ఠాకూర్ (3) బ్యాటు ఝుళిపించలేకపోయారు.
అక్షర్ పటేల్ (20 బంతుల్లో 17 నాటౌట్) కూడా కేవలం వికెట్ కాపాడుకోగలిగాడంతే. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో పార్ట్టైమర్ లియామ్ లివింగ్స్టన్, యువపేసర్ అర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. రబాడ ఒక వికెట్ తీసుకున్నాడు.