పంజాబ్తో మ్యాచ్లో మిగతా బ్యాటర్లంతా విఫలమైనా కూడా చెన్నైను అంబటి రాయుడు ఆదుకున్నాడు. ధనాధన్ షాట్లతో హాఫ్ సెంచరీ చేసిన అతను.. జట్టుకు పోరాడే అవకాశం కల్పించాడు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు.
చాహర్ వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించగా.. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రిషి ధావన్కు సెంటీమీటర్ల పైనుంచి వెళ్లిన బంతి బౌండరీ దాటింది. ఆ మరుసటి లీగల్ డెలివరీకి సిక్సర్ బాదిన రాయుడు అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చెన్నై అభిమానుల్లో గెలుపు ఆశలు చావకుండా చేశాడు.