పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను బ్యాటర్లు ముంచేశారు. ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) పూర్తిగా విఫలమయ్యారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (30) కాస్త ఫర్వాలేదనిపించాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు (78) జట్టును గెలిపించడానికి చేసిన ప్రయత్నం వృధా అయింది. రుతురాజ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా (21 నాటౌట్) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యాడు.
దాంతో రాయుడిపై తీవ్రమైన ఒత్తిడి పడింది. ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడబోయిన అతను పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ (12) కొంత ఆశలు కల్పించినప్పటికీ.. చివరి ఓవర్లో అతను కూడా భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్ కోల్పోయాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది.
విజయానికి 11 పరుగుల దూరంలో చతికిలపడింది. పంజాబ్ బౌలర్లలో రబాడ, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
That's that from Match 38.@PunjabKingsIPL win by 11 runs.
Scorecard – https://t.co/V5jQHQZNn0 #PBKSvCSK #TATAIPL pic.twitter.com/7tfDgabSuX
— IndianPremierLeague (@IPL) April 25, 2022