చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. టచ్లో ఉన్నట్లు కనిపించిన పంజాబ్ కెప్టెన్ మయాక్ అగర్వాల్ (18) పెవిలియన్ చేరాడు. మహీష్ తీక్షణ వేసిన క్యారమ్ బాల్ను మయాంక్ ఊహించలేకపోయాడు. ఈ క్రమంలో దాన్ని కట్ చేసేందుకు అతనికి సరిపోయేంత రూమ్ దొరకలేదు.
దాంతో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న శివమ్ దూబే వైపు నేరుగా కొట్టాడు. దాన్ని దూబే చటుక్కున అందుకోవడంతో మయాంక్ పెవిలియన్ చేరాడు. పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధవన్, రాజపక్స ఉన్నారు.
Maheesh Theekshana strikes and Mayank Agarwal departs for 18 runs.
Live – https://t.co/V5jQHQZNn0 #PBKSvCSK #TATAIPL pic.twitter.com/0d1Rbi1pLq
— IndianPremierLeague (@IPL) April 25, 2022