పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు తడబడుతోంది. రాబిన్ ఊతప్ప (1), మిచెల్ శాంట్నర్ (9) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ శివమ్ దూబే (8)పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అతను వాళ్లందర్నీ నిరాశ పరుస్తూ రిషిధావన్ వేసిన ఏడో ఓవర్లో అవుటయ్యాడు. ధావన్ వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. బంతిని సరిగా అంచనా వేయలేదు.
దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లపైకి దూసుకెళ్లింది. దూబే కూడా అవుటవడంతో క్రీజులోకి అంబటి రాయుడు వచ్చాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (20 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతున్నాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభిస్తే చెన్నై గెలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.