పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో అలరించాడు. అయితే ఫామ్లో ఉన్న ఊతప్ప (1) నిరాశ పరిచాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు.
సందీప్ వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా బాదడానికి ఊతప్ప ప్రయత్నించాడు. కానీ దాన్ని సరిగా బ్యాలెన్స్ కోల్పోయాడు. దాంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని రిషి ధావన్ సులభంగా అందుకున్నాడు. ఊతప్ప పెవిలియన్ చేరాడు. 10 పరుగులకే చెన్నై జట్టు తొలి వికెట్ కోల్పోయింది.