హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్పై అద్భుత విజయం సాధించింది స్టార్ రైడర్ పవన్ షెరావత్(16) టైటాన్స్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
పవన్తో పాటు ఓంకార్ పాటిల్(10) రాణించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 39-33తో యూ ముంబైపై గెలిచింది.