Pro Kabaddi | కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో పట్నా పైరెట్స్ ప్లేఆఫ్స్కు చేరువైంది. శనివారం జరిగిన పోరులో పట్నా 44-23 తేడాతో యూ ముంబాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
పట్నా తరఫున సచిన్ 10 పాయింట్లు సాధించగా.. కిషన్ (8 పాయింట్లు), సుధాకర్ (7 పాయింట్లు) రాణించారు. ముంబా తరఫున అమీర్ (12 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 55-35 తేడాతో తెలుగు టైటాన్స్ను చిత్తుచేసింది.