కొలంబో: యువ ఓపెనర్ పతుమ్ నిసాంక (137) సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. హెడ్ (70), ఫించ్ (62) రాణించారు. లక్ష్యఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నిసాంకతో పాటు కుషాల్ మెండిస్ (87) ఆకట్టుకోవడంతో లంక 48.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో లంక 2-1తో ముందంజ వేసింది.