Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథికి 2023 బాగా అచ్చొచ్చింది. ద్వైపాక్షిక సిరీస్ విజయాలతో పాటు గతేడాది యాషెస్, రెండు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న అతడు ఇటీవలే ఐపీఎల్లో వేలంలో ఏకంగా రూ. 20 కోట్లకు పైగా ధర పలికి ఏడాది మొత్తం ఫుల్జోష్లో గడిపాడు. తాజాగా ఐసీసీ అతడికి మరో గుడ్ న్యూస్ చెప్పింది. 2023 డిసెంబర్ నెలకు గాను కమిన్స్.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం బంగ్లాదేశ్ ప్లేయర్ తైజుల్ ఇస్లాం, కివీస్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా పోటీ పడ్డప్పటికీ కమిన్సే విజేతగా నిలిచాడు.
గతేడాది కమిన్స్ జూన్లో ‘ది ఓవల్’ (లండన్) వేదికగా ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన సారథిగా ఉన్నాడు. ఆ తర్వాత అక్టోబర్ – నవంబర్లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా టైటిల్ నెగ్గింది. జులై – ఆగస్టు మాసాలలో ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ టెస్టు సిరీస్లోనూ ఆసీస్దే విజయం. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇటీవలే ముగిసిన వేలంలో అతడిని రూ. 20.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కొద్దిరోజుల క్రితమే స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ పండితులు.. 2023ను ప్యాట్ కమిన్స్ ఈయర్గా నామకరణం చేశారు. తాజాగా డిసెంబర్ నెలలో పాకిస్తాన్పై అతడి ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా దక్కింది. ఈ సిరీస్లో మూడు టెస్టులు ఆడిన కమిన్స్.. ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు.
మహిళల కేటగిరీలో..
Deepti Sharma won the ICC Women’s Player of the Month award in December 2023.
– The MVP of India Women’s team..!!! pic.twitter.com/LJ8QJeXyKK
— CricketMAN2 (@ImTanujSingh) January 16, 2024
మహిళల కేటగిరీలో ఈ అవార్డు భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మను వరించింది. గత నెలలో ఇంగ్లండ్, ఆసీస్తో స్వదేశంలో రెండు టెస్టులు ఆడిన దీప్తి.. కంగారూలతో మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టగా ఇంగ్లండ్తోనూ 9 వికెట్లు తీసి భారత్ విజయాలలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్లో సైతం దీప్తి ఉపయుక్తకరమైన పరుగులు సాధించింది.